నిజంనిప్పులాంటిది

Apr 04 2024, 16:28

Liquor Scam Case: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha) అని ఆరోపించారు..

గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్‌పై ఒక పిటిషన్‌పై విదానలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. కవితపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు.

విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు వివరించింది ఈడీ. ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారన్నారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు ఈడీ తరపు న్యాయవాది..

నిజంనిప్పులాంటిది

Apr 04 2024, 13:43

కాంగ్రెస్‌కు షాక్‌.. పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం మునిగిపోయే పడవలా కనిపిస్తోంది. దీనిపై రైడర్లు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ పెద్దలు మాత్రమే చేతులు ఊపుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన వారికి మరో పేరు చేరింది. కాంగ్రెస్ ఆవేశపూరిత అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు.పార్టీకి రాజీనామా చేస్తూ సనాతన్ వ్యతిరేక నినాదాలు చేయలేనని గౌరవ్ వల్లభ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టం.

'నాకు సుఖం లేదు'

గౌరవ్ వల్లభ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. ఆయన ఖర్గేకు పంపిన రాజీనామా లేఖ ఫోటోను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు - 'ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న దిక్కులేని తీరుతో నేను సుఖంగా లేను. నేను సనాతన్ వ్యతిరేక నినాదాలు చేయలేను లేదా దేశంలోని సంపద సృష్టికర్తలను ఉదయం మరియు సాయంత్రం దుర్వినియోగం చేయలేను. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.

'నిజాన్ని దాచడం కూడా నేరమే, నేను అందులో భాగం కానక్కర్లేదు'

ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో, తాను భావోద్వేగానికి గురయ్యానని, హృదయవిదారకంగా ఉన్నానని రాశారు. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, వ్రాయాలనుకుంటున్నాను మరియు చెప్పాలనుకుంటున్నాను. కానీ నా విలువలు అలా మాట్లాడకుండా నిషేధించాయి. అయినా నిజాన్ని దాచడం కూడా నేరంగా భావించి ఈ రోజు నా అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాను. అటువంటి పరిస్థితిలో, నేను నేరంలో భాగం కాకూడదనుకుంటున్నాను.

యువతను, ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ గౌరవించదు

గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ - 'నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, యువకులు, మేధావులు మరియు వారి ఆలోచనలకు విలువ ఇచ్చే దేశంలో కాంగ్రెస్ అత్యంత పురాతనమైన పార్టీ అని నేను నమ్మాను, కాని గత కొన్నేళ్లలో పార్టీ ప్రస్తుత రూపం అని నేను గ్రహించాను. కొత్త ఆలోచనలతో యువతతో సరిపెట్టుకోలేక ఐఏఎస్. పార్టీ యొక్క గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది, ఇది నవ భారతదేశం యొక్క ఆకాంక్షను అస్సలు అర్థం చేసుకోలేకపోతుంది, దాని కారణంగా పార్టీలో చేరలేకపోతుంది లేదా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది. ఇది నాలాంటి కార్మికులను నిరుత్సాహపరుస్తుంది.

‘పెద్ద నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలకు దూరం పెరిగింది’

గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ, 'కాంగ్రెస్ యొక్క గ్రౌండ్ లెవల్ కనెక్షన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. పెద్ద నాయకులు మరియు అట్టడుగు ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గించడం చాలా కష్టం. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ చర్యపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. శ్రీరాముడి జీవితానికి సంబంధించి కాంగ్రెస్ వైఖరి పట్ల నేను కలత చెందుతున్నాను. నేను పుట్టుకతో హిందువుని మరియు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. పార్టీ యొక్క ఈ వైఖరి నాకు ఎప్పుడూ అసౌకర్యంగా ఉంది. పార్టీలోనూ, కూటమిలోనూ చాలా మంది వ్యక్తులు సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ మౌనం దానికి మౌనంగా ఆమోదం తెలిపినట్లే.

నిజంనిప్పులాంటిది

Apr 04 2024, 13:00

హైదరాబాద్ జిల్లా లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నా యి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు అడ్డంగా దొరికిపోయారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట దగ్గర అనుమా నంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా అందు లో 25 లక్షల నకిలీ కరెన్సీ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడింది.

ఇక, నిందితులు మూడిం తల నకిలీ కరెన్సీ ఇచ్చి ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్టు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు గుర్తించారు.

కాగా, షేక్ హరుణ్, సయ్య ద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులంతా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా ఎస్ఓటి పోలీసులు గుర్తిం చారు. నిందితుల నుంచి చిల్ద్రెన్ బ్యాంక్ కు సంబం ధించిన 25 లక్షల రూపాయ ల నకిలీ కరెన్సీతో పాటు నిస్సాన్ కంపెనీకి చెందిన కారు, నాలుగు మొబైల్ ఫోన్స్ కీ ప్యాడ్ మొబైల్, 8240 వేల ఒరిజినల్ కరెన్సీ రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

నిజంనిప్పులాంటిది

Apr 04 2024, 12:59

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీ కారం చేశారు.

సోనియా గాంధీతో రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు.

సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ,ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 03 2024, 13:34

తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ

తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది..

తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్‌ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో​ జనాలు రోడ్లమీదకు వచ్చారు.

ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు.

నిజంనిప్పులాంటిది

Apr 03 2024, 13:32

తెలంగాణలో డీఎస్సీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో డీఎస్సీ పరీక్ష కు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూ ల్ ప్రకారం ఆన్‌లైన్ అప్లికేష న్లకు నేటితో గడువు ముగి సింది. అయితే దీనిని జూన్ 20 వరకు పొడిగించింది.

దీంతో అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే డీఎస్సీ పరీక్ష తేదీలను ఖరారు చేశారు.

జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిం చనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చింది.

ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నా యి. 727 భాషా పండితు లు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేష న్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి..

నిజంనిప్పులాంటిది

Apr 02 2024, 10:40

మూడు నెలలూ మండే ఎండలు

•ఏప్రిల్‌, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక

దిల్లీ: దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది..

మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశముందన్నారు.

సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని హెచ్చరించారు. గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు..

నిజంనిప్పులాంటిది

Apr 02 2024, 10:38

'కాళేశ్వరం' దోషులెవరో తేల్చండి

•విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు ఇరిగేషన్‌ అధికారులు

బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విచారణ కార్యాలయం ఏర్పాటు

విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు నీటిపారుదల శాఖ అధికారులు..

హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని జ్యుడిషీయల్‌ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో కమిటీ చైర్మన్‌ అయిన జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా నేతృత్వంలోని అఽధికారుల బృందం కలవనుంది.

ఇప్పటికే రాహుల్‌బొజ్జాతో పాటు ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ (పీఅండ్‌ఎం) కె.శ్రీనివాస్‌ కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం అపాయింట్‌మెంట్‌ ఉండటంతో ఆయన్ను కలిసి, టీవోఆర్‌ అందించి, కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కేఆర్‌)లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులెవరో గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక అందించాలని ఘోష్‌ను అధికారులు కోరనున్నారు.

ఆ ఏడు అంశాలేంటంటే...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్‌, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలి

కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించాలి

3 బ్యారేజీల్లో ఆపరేషన్‌ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చాలి

క్వాలిటీ కంట్రోల్‌, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరపాలి

నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌-ఈవోటీ), పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించాలి

కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గుతేల్చాలి

ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే.. వాటిపై విచారణ చేయాలి..

నిజంనిప్పులాంటిది

Apr 02 2024, 10:33

కడప బరిలోనే షర్మిల

5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌

నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..

రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను మంగళవారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు.

సీఈసీ సమావేశం సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ఎస్టీఎస్టీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, షర్మిల పాల్గొన్నారు.

మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించారు. కడప ఎంపీ స్థానంలో షర్మిల, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, విశాఖ-సత్యారెడ్డి, కాకినాడ-ఎంఎం పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు తెలిసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని సమాచారం. కమ్యూనిస్టు పార్టీలతో సర్దుబాటు నేపథ్యంలో మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తొలి జాబితా ప్రకటన కోసం షర్మిల మంగళవారం కడప జిల్లాకు వెళ్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 02 2024, 10:28

కవిత కోరుకున్న సౌకర్యాలు కల్పించండి: అవెన్యూ కోర్టు

తిహాద్ జైల్లో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవస రమైన సౌకర్యాలు కల్పిం చాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల ను ఆదేశించింది.

కొన్ని వస్తువులను స్వయం గా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమా ల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్‌ చేసుకునేందు కు, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకు నేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించా లని న్యాయస్థానం ఆదేశిం చింది.

మార్చి 26న ఇచ్చిన ఉత్త ర్వుల్లో ఏ ఒక్కటీ అనుమ తించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నిం టినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ న్యాయ స్థానానికి తెలిపారు.

దీనిపై స్పందించిన రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.